Kamal Haasan- Mani Ratnam : విశ్వనటుడు కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో ‘KH 234’ మరో సూపర్ డూపర్ రానుంది. వీరి కాంబోలో గతంలో ‘నాయకుడు’ ఆ మూవీ వచ్చి 36 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా రానుంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్కి చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సమర్పిస్తుంది.
ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఏఆర్ రహెమాన్-కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో రానున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. కమల్ హాసన్-ఏఆర్ రహెమాన్ కాంబోలో 2000 లో తెనాలి వచ్చింది.
ఆదివారం (సెప్టెంబర్ 10) సాయంత్రం మేకర్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, కమల్ ఈ చిత్రానికి పని చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ‘35 సంవత్సరాల క్రితం నేను మిస్టర్ మణిరత్నంతో కలిసి పని చేయబోతున్నాను. ఇది నాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇందులో రెహమాన్ కూడా ఉండడం మరింత ఆనందం కాగా.. ఉదయనిధి స్టాలిన్తో కలిసి ఈ వెంచర్ ప్రదర్శించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నాడు కమల్ హాసన్.
ఇక మణిరత్నం మాట్లాడుతూ ‘‘కమల్ సర్తో మళ్లీ కలిసి పని చేయడం ఆనందంగా, గౌరవంగా, ఉత్సాహంగా ఉంది.’ అన్నాడు.
నిర్మాత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని సమర్పించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పటికే ‘విక్రమ్’తో కమల్ హాసన్ మరోసారి భారీ విజయం సొంతం చేసుకున్నాడు. ఇక భారతీయుడు2 కూడా త్వరలో రాబోతోంది. తర్వాత కమల్ సర్తో కలిసి ‘ఉలగనాయగన్ KH 234’ను అందించడం అద్భుతమైన అవకాశం. ఈ చిత్రాన్ని సమర్పించడం సంపూర్ణ గౌరవం. కమల్ సర్, మణి సర్ ప్రపంచ వ్యాప్తంగా తమిళ సినిమాకి గర్వకారణం. నేను ఈ ఇద్దరు దిగ్గజ వ్యక్తులను అమితంగా ఆరాధిస్తాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కమల్ సర్’ అన్నారు.
నటీనటులు మరియు సిబ్బందికి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉండగా.. దక్షిణాది స్టార్ నటులు త్రిష కృష్ణన్, జయం రవి, పాన్ ఇండియా నటుడు దుల్కర్ సల్మాన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కమల్ హాసన్ ప్రస్తుతం బిగ్ బాస్ తమిళ రియాలిటీ షోకి హోస్టింగ్ డ్యూటీలతో బిజీగా ఉన్నారు . నటన విషయానికొస్తే, అతను శంకర్తో ఇండియన్ 2 మరియు మలయాళ చిత్ర నిర్మాత మహేష్ నారాయణన్తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. నిర్మాతగా, అతను రాజ్కుమార్ పెరియసామితో శివకార్తికేయన్ చేయబోయే చిత్రానికి మరియు ఉదయనిధితో ఒక చిత్రానికి మద్దతు ఇస్తాడు.
మణిరత్నం ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ బ్లాక్ బస్టర్ విజయం కోసం లైమ్లైట్లో ఉన్నారు . మాగ్నమ్ ఓపస్ యొక్క రెండో భాగం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.
Here we go again! #KH234
பயணத்தின் அடுத்த கட்டம்!
#ManiRatnam @Udhaystalin @arrahman #Mahendran @bagapath @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM pic.twitter.com/ATAzzxAWCL— Kamal Haasan (@ikamalhaasan) November 6, 2022