Sankranti Movies : గతంలో సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి క్లాషెస్ వచ్చినా ఇండస్ట్రీలోని పెద్ద నిర్మాతలు, దర్శకులు సదరు సమస్యలను పరిష్కరించేవారు. వారి జోక్యంతో అంతా సద్దుమనిగేది. కాని ఇప్పుడు ఎవ్వరూ ఇండస్ట్రీ పెద్దన్న పాత్రలో లేకపోవడంతో సినిమాల రిలీజ్ కు థియేటర్లు దొరకక క్లాష్ ఏర్పడుతుంది. ఫలితంగా నిర్మాతలు నష్టపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా, ఈగల్, హను-మ్యాన్ సహా ఐదు సినిమాలు 2024 సంక్రాంతి బరిలో నిలువనున్నాయి. ఈ సినిమాలన్నింటికీ సరిపడా థియేటర్లు, స్క్రీన్లు ఉన్నాయని వారు చెబుతున్నప్పటికీ, ఈ ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూషన్, ప్లేస్ మెంట్, క్లాష్ డేట్స్ విషయంలో ఖచ్చిత యుద్ధం జరుగుతోంది. అయితే, ఈ పరిస్థితిలోకి వచ్చి సమస్యలను పరిష్కరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
గతంలో అనుభవజ్ఞులైన అగ్రస్థాయి నిర్మాతలు ఏదైనా పెద్ద క్లాష్ డేట్స్ ప్రకటించినప్పుడు దాసరి నారాయణరావు లాంటి ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకొనే వారు. నిర్మాతలతో మాట్లాడి రిలీజ్ డేట్లను సర్ధి సమస్యలను పరిష్కరించేవారు. అది ఒక్కో సినిమాకు సరైన సంఖ్యలో థియేటర్లు సమకూర్చడంలో తోడ్పడేది. బయ్యర్లు-డిస్ట్రిబ్యూటర్లు సినిమాల టాక్ చూసి స్క్రీన్ కౌంట్ మార్చేవారని అంటున్నారు.
కానీ ఇప్పుడు ఒక్కో డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొన్ని సినిమాలకు సపోర్ట్ చేస్తుండడంతో ఆ సినిమాలకు మాత్రమే మంచి స్క్రీన్లు, పర్ఫెక్ట్ లొకేషన్స్, సరైన రిలీజ్ డేట్స్ దొరుకుతాయి. కొన్నాళ్ల క్రితం వరకు మెగాస్టార్ చిరు కూడా కొన్ని విషయాల్లో జోక్యం చేసుకునేవారని, అయితే టికెట్ల విషయంలో ఏపీ సీఎం జగన్ ను కలిసినందుకు ట్రోల్ కు గురైన తర్వాత ఆయన ‘ఇండస్ట్రీ పెద్దన్న’ పాత్ర పోషించకుండా పక్కకు తప్పుకున్నారని అంటున్నారు.
‘ఇండస్ట్రీ పెద్దన్న’ పర్సనాలిటీ ఏదీ చేతుల్లోకి తీసుకోకపోవడంతో కచ్చితంగా రిలీజ్ గొడవలు గందరగోళంగా మారుతున్నాయి. ఇప్పుడు దాదాపు అన్ని సంక్రాంతి రిలీజ్ లు వాయిదా పడుతూ టీజర్లు, ట్రైలర్స్, సాంగ్స్ రిలీజ్ డేట్ తో స్టార్ట్ చేస్తుండడంతో ఎవరూ స్లాట్ నుంచి వెనక్కి తగ్గడం లేదు. మరి ఇది ఎలా ముగుస్తుందో చూడాలి.