Big win for Congress in Karnataka : కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 135 సీట్లు ఇప్పటికే గెలుచుకొని ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఈసారి కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. మరొకరి మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. మరోవైపు పార్టీ సీఎం అంశంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గెలిచన వారిని బెంగళూరుకు రావాలని పిలుపు అందింది. సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జన్ ఖార్గే చర్చలు కొనసాగిస్తున్నారు. డీకే శివకుమార్, సిద్ధ రామయ్య ఇద్దరిలో ఎవరిని ఈ అదృష్టం వరిస్తుందో రేపు తెలియనుంది.
అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో..
ముందు నుంచి పార్టీ గెలుపు కోసం పీసీసీ చీఫ్ డీ కే శివకుమార్ ఎంతో కష్టపడ్డారు. ఈడీ, సీబీఐ ఇబ్బందులు పెడుతున్నా వాటిని ఎదుర్కొని ఆయన ధైర్యంగా ముందుకెళ్లారు. ఈ సమయంలో పార్టీకి సీఎంగా ఎవరిని నిర్ణయించాలో కొంత ఇబ్బందికరంగా మారింది. మరో వైపు 64 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 20 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా బెంగళూరుకు చేరుకుంటున్నారు. రేపు మధ్యాహ్నం బెంగళూరు లో జరిగే కీలక సమావేశంలో సీఎం అభ్యర్థిని నిర్ణయించనున్నారు. 136 సీట్లతో ముందంజలో ఉన్న కాంగ్రెస్ ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇక లాంఛనమే.