Chandrababu : రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. పెన్షన్ల పంపిణీ పై వెంటనే నిర్ణ యం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఆయన లేఖ రాశారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ పై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్న కారణంగా లబ్ధిదారులకు నగదు అందించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. వృద్ధలు, వింతంతు వులు, ఇతర లబ్దిదారులకు నగదు రూపంలో పెన్షన్ మొత్తం చెల్లించాలన్నారు.
గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో, ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ పంపిణీ జరిపేలా చూడాలన్నారు. దీనికోసం సచివాలయ సిబ్బంది పెన్షన్ మొత్తాన్ని బ్యాంకులో నుంచి తీసుకొని వెళ్లడానికి అనుమ తించాలి దీనికి అవసరమైన అనుమతులు ఇవ్వాలన్నారు. పెన్షన్ ల పంపిణీకి అవసరం అయిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదు అనే వార్తలు వస్తున్నాయని చంద్రబాబు ఆరోపిం చారు.
ఈ కారణంగా పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధులు వెంటనే అందుబాటులో ఉంచండన్నారు. గతంలో ఇచ్చిన విధంగా 1 నుంచి 5 తేదీ మధ్య పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడానికి అవ రమైన యంత్రాంగాన్ని, నిధులను సిద్ధం చేయాలని కోరుతున్నానని ఆయన తెలిపారు.చీఫ్ సెక్రటరీతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో పెన్షన్ ల పంపిణీకి తగు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను చంద్రబాబు నాయుడు కోరారు.