Congress MP Candidates : లోక్ సభ ఎన్నికల కు కాంగ్రెస్ పార్టీ 36 మందిలో తొలి జాబితాను ప్రకటించింది. అందులో తెలంగాణకు చెందిన నాలుగు ఇప్పిస్తానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
జహీరాబాద్ -సురేష్ షేట్కార్, చేవెళ్ల -సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ-కందుకూరు రఘువీర్, మహబూబాబాద్-బలరాం నాయక్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎంపికపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది.
ఇప్పటికే బిజెపి పార్టీ కొంతమంది పేర్లను ప్రకటిం చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్య ర్థులను ప్రకటించింది. మిగిలిన ఎంపి స్థానాలకు కూడా అతి త్వరలో అభ్యర్థులను ఎంపిక చేయను న్నట్లు సమాచారం అందుతుంది.
ప్రస్తుతం తెలంగాణలో నలుగురు ఎంపీ అభ్యర్థు లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఎంపిక చేసిన వారు తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి లో ఇప్పటినుంచి ప్రజలను కలుసుకోవాలని రాష్ట్ర నాయకత్వం వారికి సూచనలు జారీ చేసింది. ఎంపీ అభ్యర్థులుగా పేర్లు ప్రకటించడంతో ఎంపికైన వారు కాంగ్రెస్ పార్టీ కి కృతజ్ఞతలు తెలియజేశారు.