Corona JN.1 variant : దేశంలో మళ్లీ కరోనా కలకలం చోటు చేసుకుంది. చలికాలం కావడం.. కరోనాకు అనువైన కాలం కావడంతో చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కొత్తగా దేశంలో JN.1 వేరియంట్ పంజా విసురుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 ఇటీవల దేశంలో వ్యాపిస్తోంది. దీనివల్ల కేరళలో ఒక మరణం నమోదైంది. ఈ కొత్త వేరియంట్ వల్ల భారతదేశం లో కోవిడ్-19 క్రియాశీల కేసుల సంఖ్య సోమవారానికి 1,828కి పెరిగింది.
కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 ఇప్పటివరకూ కేరళలో నలుగురు, ఉత్తరప్రదేశ్లో ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, గుండె సమస్యలతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
కరోనా నుంచి ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 4.46 కోట్లకు (4,44,69,931) పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇప్పటివరకు కోవిడ్ -19 కారణంగా 5,33,317 మంది మరణించారు. కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి.
ఆదివారం భారతదేశంలో 335 తాజా కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల కేసులను నమోదు చేశారు. క్రియాశీల కేసుల సంఖ్య 1,701 కు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐదు మరణాలు నమోదయ్యాయి. కేరళలో నలుగురు.. ఉత్తరప్రదేశ్లో ఒకరు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది.
కేరళలో కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 వల్ల ఒకరు మరణించరాు. కేరళకు చెందిన 79 ఏళ్ల మహిళలలో COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసు కనుగొనబడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నుండి శనివారం ఈ మేరకు అధికారికంగా ఈ కొత్త వేరియంట్ ను గుర్తించారు.
డిసెంబర్ 8న దక్షిణాది కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాలోని కరకుళం నుండి RT-PCR పాజిటివ్ శాంపిల్లో ఈ కేసు కనుగొనబడిందని ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ తెలిపారు. ఈమెకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. అప్పటి నుండి కోవిడ్ -19 నుండి కోలుకుంది.
సింగపూర్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేసిన భారతీయ ప్రయాణీకులలో సబ్-వేరియంట్ నెలల క్రితం కనుగొనబడిందని చెప్పారు. “ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఇది సబ్-వేరియంట్. ఇది ఇప్పుడే ఇక్కడ కనుగొనబడింది. నెలల క్రితం, సింగపూర్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయబడిన కొంతమంది భారతీయులలో ఈ వేరియంట్ కనుగొనబడింది. కేరళ లో ఈ వేరియంట్ను కేంద్రం గుర్తించింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్రం తెలిపింది.