Chandrababu Naidu : రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఐదేళ్లుగా ఐదు కోట్ల మంది ఈరోజు కోసం ఎదురు చూశారని చంద్రబాబు అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని ఇక జగన్ కు కౌంట్ డౌన్ మొద లైందన్నారు. ఇక పోలింగ్ మిగి లిందని ఒక్క ఛాన్స్ ప్రభుత్వా నికి నో ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా గళం వినిపించే రోజు రాబోతుందన్నారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడు గు కు స్వాగతం పలుకుదామని చంద్రబాబు అన్నారు. ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులు అని టిడిపి అధినేత ట్విట్ చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి కుంటుప డిందని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందక ఇబ్బందులు పడుతున్నారనీ బాబు విమర్శించారు. ప్రజలు జగన్ కు గుణపాఠo చెప్పడానికి సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు.