MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉంటున్న BRS ఎమ్మెల్సీ కవితకు కొన్ని సౌక ర్యా లు కల్పించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటి భోజనం, మంచం, పరుపులు, చెప్పులు, దుస్తులు, పుస్తకాలు స్వయంగా ఏర్పా టు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
పెన్ను, పేపర్లు, నగదు, మందులు తీసుకెళ్లేందుకు అంగీకరించింది. కాగా ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడి అధికారులు అరెస్టు చేసి వారం రోజులపాటు ఆమెను కష్టాల్లోకి తీసుకొని విచారణ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ ను విధించారు.