కరోనా సమయంలో రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు ఓ బిడ్డ తండ్రి అయ్యాడు. మొదటి పుట్టిన రోజు వేడుకలను వెయ్యి మంది స్టార్ల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాడు. కొడుకు బర్త్ డే కు సినిమా పరిశ్రమకు చెందిన చాలా మందిని పిలిచాడు. దాదాపు వెయ్యి మంది సెలబ్రిటీల సమక్షంలో తన కొడుకు అన్వీ బర్త్ జరుపుకోవడం విశేషం.
మరోవైపు రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వదంతులు వ్యాపిస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. డైరెక్టుగా రాజ్యసభకు వెళతారనే ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా ఈ విషయం ప్రచారం మాత్రం ముమ్మరంగా అవుతోంది. దిల్ రాజు మనసులో ఏముందో ఎవరికి తెలుసు.
తన కొడుకు పుట్టిన రోజు కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ గా చేయడానికి కారణం అదేనట. ఈ నేపథ్యంలో దిల్ రాజు రాజకీయాల వైపు వెళిలే సినిమాలకు బ్రేక్ పడే అవకాశముంటుంది. సినిమా పరంగా అచ్చొచ్చిన రంగం కావడంతో విజయాలు అందుకుంటున్నాడు. రాజకీయ రంగం కొత్తది కావడంతో అక్కడ ఏ మేరకు రాణిస్తాడో చూడాల్సిందే. సినిమాకు రాజకీయాలకు కూడా దగ్గరి సంబంధం ఉంటుంది.
ReplyForward
|