Cures Anemia : ప్రస్తుత రోజుల్లో రక్తహీనత ఆడవారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆడవారు రజస్వల అయిన నాటి నుంచి నెలసరి సమస్యలు వేధిస్తుంటాయి. ఆ సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది. దీంతో వారికి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈనేపథ్యంలో వారి సమస్యలు పోవాలంటే సరైన ఆహారం తీసుకోవాల్సిందే. లేకపోతే ఇబ్బందులు వస్తుంటాయి. రక్తహీనతతో అలసట వస్తుంది.
రక్తహీనతకు చెక్ పెట్టాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ప్రతి రోజు నాన బెట్టిన ఎండు ద్రాక్షలు తీసుకుంటే మంచి లాభాలుంటాయి. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని కాపాడే ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష రసం తాగడం వల్ల పలు రకాల సమస్యల నుంచి దూరం కావచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రక్తహీనత వల్ల శ్వాస కోశ సమస్యలు కూడా వస్తాయి. ఎసిడిటి పెరుగుతుంది. దీనికి విరుగుడుగా ఎండు ద్రాక్షల రసం తాగడం వల్ల పొటాషియం మెగ్నిషియం అందుతాయి. దీంతో పొట్టలోని యాసిడ్స్ అదుపులో ఉండి మనకు సమస్యలు రాకుండా ఉంటుంది. అందుకే ఎండు ద్రాక్షల వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయని తెలుసుకోవాలి.
ఈ రోజుల్లో కాలేయ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. వీటికి ఎండు ద్రాక్ష చెక్ పెడుతుంది. ఎండు ద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల శరీరం డీటాక్సీపై అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల కాలేయంలో పిత్త ఉత్పత్తిని చేయడానికి దోహదపడుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.