ఎండాకాలంలో మట్టికుండ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మట్టికుండలో నీరు చల్లగా ఉంటుంది. ఫ్రిజ్ వాటర్ కంటే ఎంతో మేలు. ఈ నేపథ్యంలో మట్టికుండను వాడుకోవడం మంచిది. మట్టికుండలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీని వల్ల కుండను వాడటం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దక్కుతాయి. మట్టికుండ వాడితేనే మంది. ఫ్రిజ్ వాటర్ అంత సురక్షితం కాదు.
మట్టికుండలో నీళ్లు తాగడం వల్ల వడదెబ్బ ముప్పు ఉండదు. ఇందులోని నీరు తాగడంతో వడదెబ్బ ముప్పు రాకుండా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ కూడా మెరుగ్గా ఉంటుంది. ప్రతి రోజు మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల పలు రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. తినే ఆహారం శరీరంలోకి వెళ్లి ఆమ్లంగా మారి విడుదల చేసే విషాన్ని మట్టికుండలోని నీరు నిరోధిస్తుంది.
మట్టి కుండలోని నీరులో అల్కలీన్ ఉంటుంది. దీంతో పీహెచ్ సమతుల్యతను నివారిస్తుంది. జీర్ణకోశ, ఎసిడిటి సమస్యలు రాకుండా చేస్తుంది. ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. మట్టికుండలో నీరు ఖచ్చితమైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. అందుకే కుండలో నీరు తాగడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
మట్టికుండలో నీరు తాగితే సహజమైన లాభాలు దక్కుతాయి. పూర్వం రోజుల్లో మన వారు మట్టి కుండలనే వాడేవారు. దీంతో వారి ఆరోగ్యం బాగుండేది. రానురాను మొత్తం స్టీలు పాత్రలు వచ్చాయి. మట్టి పాత్రలు అంతరించాయి. అందుకే రోగాల ప్రభావం పెరిగింది. ఫలితంగా అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. వేసవి కాలంలో మట్టికుండలనే వాడుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.