Hanumantha Rao : తెలంగాణ: కాంగ్రెస్ లో BRS నేతల చేరికపై ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమం తరావు అస హనం వ్యక్తం చేశారు. బీ అర్.ఎస్ ను కాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సీఎం మాత్రం ఆ పార్టీ నేతలను ఎలా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తా రని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి వారిని తీసుకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారినీ అన్యాయం చేయొద్దని హనుమంతరావు అన్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి వెళ్లి ఆ పార్టీ నేతలను ఆహ్వానించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇలా చేసి ఆయన తన స్థాయి ని తానే తగ్గించుకుం టున్నారని హనుమంతరావు వ్యాఖ్యా నించారు.
గత కొద్ది రోజుల నుంచి హనుమంతరావు సీఎం రేవంత్ రెడ్డి పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నా రు. పార్టీ కోసం కష్టపడిన తనకు ఏ పోస్ట్ ఇవ్వకుం డా సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. హనుమం తరావుని గుర్తించకుండా ఆయనకు పదవి ఇవ్వకుండా సీఎం పట్టించుకోక పోవడంతో హనుమంతరావు ఈ విధంగా స్పందించారు.