Joint Capital : ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తవుతోంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. ఈ సమయంలో హైదరాబాద్ నగరాన్ని మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు చట్టం తెచ్చేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని అందులో కోరారు. కేంద్రాన్ని ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.
ఉమ్మడి రాజధానిగా : కేంద్ర ప్రభుత్వం మరో పదేండ్లు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేసేలా చట్ట రూపకల్పనకు ఉత్తర్వులు ఇవ్వాలని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్కు మార్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 2034 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆయన కోరారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు తొమ్మిదవ షెడ్యూల్లోని కంపెనీలు, కార్పొరేషన్ల ఆస్తుల విభజన పూర్తి కాలేదని అందులో పేర్కొన్నారు. 2034 జూన్ 2వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా, కేంద్ర హోంశాఖకు ప్రతిపాదన పంపించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిం చాలని అభ్యర్దించారు.
వివాదాలు తేలలేదు : ఈ పిల్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యద ర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శిని వ్యా జ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ‘ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయం గా విభజించడంతో రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తు న్నా ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిం దని వివరించారు.