Hyper Aadi, Anchor Varshini : సోషల్ మీడియా విపరీతంగా పాపులర్ అయిన తర్వాత బుల్లితెర నుండి వెండితెర వరకు అందరికి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటున్నారు.. రోజు కొత్త కొత్త పోస్టులు పెడుతూ నెట్టింట ఫాలోవర్స్ ను అమాంతం పెంచుకుంటూ పోతున్నారు. మరి మన బుల్లితెర మీద బాగా పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుధీర్, ఆది, రష్మీ, ప్రదీప్ వంటి వారు చాలా మంది ఉన్నారు.
వీరంతా బాగా పాపులర్ అయ్యారు.. రోజు ఆడియెన్స్ ను వివిధ రకాల షోలతో పలకరిస్తూనే ఉంటారు.. మరి యాంకర్స్ లో పాపులర్ అయిన వారిలో వర్షిణి సౌందర్యరాజన్ కూడా ఉంది.. ఈమె పటాస్ షోతో ఎంట్రీ ఇచ్చి అక్కడి నుండి కొద్దికొద్దిగా పాపులర్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఢీ షోలో అవకాశం అందుకుంది..
ఆదితో జోడీగా ఢీలో ఆఫర్ అందుకుని మరింత ఫాలోవర్స్ ను అందుకుంది.. అయితే ఢీ షో తర్వాత మరో ఆఫర్ అందుకోక పోవడంతో అమ్మడు సినిమాల వైపు మళ్లింది.. సినిమాల్లో ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంది.. చిన్న చిన్న రోల్స్ తో పాటు వెబ్ సిరీస్లు కూడా చేసుకుంటూ పోతుంది.
అయితే ఈ అమ్మడి పెళ్లి మ్యాటర్ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఆదితో పెళ్లి అంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.. మరి తాజాగా ఫ్యాన్స్ లో చిట్ చాట్ నిర్వహించగా అందులో భాగంగా తన పెళ్లి వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది..