Harish Rao : బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మంత్రి హరీశ్ రావు ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రచార కార్యక్రమంలో మరోసారి అమరావతిని పోల్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్ మరో అమరావతి అవుతుందని హరీశ్రావు ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేలా హెచ్చరికలు పంపారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే అమరావతి తరహాలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పూర్తిగా తగ్గిపోతుందని భయాందోళనను వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని చెన్నైలో నివసించే సూపర్స్టార్ రజనీకాంత్కు అర్థమైందని, అయితే ఇక్కడి కొందరు గజినీలు అర్థం చేసుకోలేకపోయారని హరీశ్రావు అన్నారు. “రజనీకాంత్ హైదరాబాద్ అభివృద్ధిని చూసి మైమరచిపోయి న్యూయార్క్తో పోల్చారు. అయితే, ఇక్కడ ఉన్న కొందరు వ్యక్తులు దానిని అర్థం చేసుకోలేరు, ”అని హరీష్ చెప్పాడు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో సూపర్ హిట్ అయిందని అందుకే కేసీఆర్ భరోసా అని పేరు పెట్టారని హరీశ్ రావు అన్నారు.
బీఆర్ఎస్పై ఎన్ని కుయుక్తులు పన్నినా పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కళ్ల ముందు చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ డకౌట్ అవుతుందని, కాంగ్రెస్ రన్ అవుట్ అవుతుందని, కేసీఆర్ సెంచరీ చేస్తాడని హరీశ్ రావు అన్నారు.