Kadiyam Srihari : తాను కమీషన్లు తీసుకున్నట్లు ఎవరూ నిరూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి కడియం శ్రీహరి సవాల్ విసిరారు. లిఫ్ట ఇరిగేషన్ లో పల్లా లంచాలు తీసుకున్నారని, కాంట్రాక్టర్ వద్ద ఆయన రూ.104 కోట్ల కమీషన్ తీసుకున్నారని అన్నారు.
ఆయన, రాజయ్య ఇద్దరూ తోడు దొంగలని అన్నారు. రాజయ్య దళితబంధులో లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని పలు స్లేషన్లలో కేసులు నమోదై ఉన్నాయన్నారు. కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తారా..? అని శ్రీహరి ప్రశ్నించారు.
గతంలో కూడా ఒకసారి ఇలాగే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తాను ఎమ్మల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర పనులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని అప్పట్లో అన్నారు.