Chandrababu : ఆంధ్రప్రదేశ్ కు మూడు సార్లు సీఎంగా, రెండు సార్లు ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ అనుభవం ఉన్న నేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీని కొన్ని కారణాల వల్ల తన చేతిలోకి తెచ్చుకుని ఆ పార్టీని ఇప్పటికీ అదే ఉత్సాహంతో నడుపుతున్న తీరు మెచ్చుకోదగ్గదే. నాలుగు దశాబ్దాలు దాటుతున్నా రాష్ట్రంలో ప్రధాన పార్టీగా టీడీపీ వెలుగొందుతుందంటే అది చంద్రబాబు చలువే. 2019 ఎన్నికల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పటికీ మరి కొద్ది రోజుల్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఫుల్ జోష్ తో సిద్ధమైంది.
2024 అసెంబ్లీ ఎన్నికలు టీడీపీ అత్యంత కీలకమైనవి. అలాగే జనసేన, బీజేపీ, వైసీపీలకు కూడా. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అధికారం రాకుంటే టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని మాత్రం సంకోచం లేకుండా చెప్పవచ్చు. ఇవన్నీ తెలిసే ఆయన చాలా వ్యూహత్మకంగా పావులు కదిపారు. జగన్ రెడ్డిని ఓడించాలంటే ఒంటరిగా వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అంతిమంగా వైసీపీకే మేలు జరుగుతుందని అంచనా వేశారు. గతంలో చేసిన తప్పును ఇప్పుడు చేయకూడదంటే కచ్చితంగా పొత్తులు పెట్టుకోవాల్సిందే. అందుకే జనసేన, బీజేపీతో సుదీర్ఘంగా చర్చించి పొత్తులు పెట్టుకున్నారు.
ఈక్రమంలో జనసేన, బీజేపీలకు తక్కువ సీట్లు ఇవ్వడం, అలాగే తాము బలంగా లేని చోట వారికి సీట్లు ఇవ్వడం అనేది చంద్రబాబు వ్యూహమనే చెప్పాలి. అయితే ఈ మూడు పార్టీల్లో పెద్ద పార్టీ టీడీపీనే.. కాబట్టి ఆ పార్టీకి కచ్చితంగా మొగ్గు ఉండాల్సిందే. అలాగే టీడీపీకి మాత్రమే మిగతా రెండు పార్టీలతో పోలిస్తే ప్రతీగ్రామంలో బలమైన క్యాడర్ ఉంది. అందుకే ఆ పార్టీలు టీడీపీని అనుసరించాల్సిందే.
ఇక జగన్ ఓడించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం కచ్చితంగా అవసరం. గతంలో బీజేపీ కేంద్ర పెద్దలతో చంద్రబాబు విభేదాలు ఉన్నప్పటికీ..జగన్ ను ఓడించడానికి వాటిని పక్కకు ముందుకు నడిచారు చంద్రబాబు. దీంతో మోదీ, అమిత్ షా కూడా చంద్రబాబుతో పొత్తుకు అంగీకరించారు. చంద్రబాబు చాణక్యం ద్వారా రాబోయే ఎన్నికల్లో మూడు పార్టీలకు మేలు జరిగే అవకాశం ఉండబోతోంది.