Adipurush Event : ఇప్పుడు ఎక్కడ సినిమా అభిమానులు కలుసుకున్నా ప్రభాస్ న్యూ మూవీ ‘ఆదిపురుష్’ గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో నిర్వహించాలని మేకర్స్ నిర్వహించారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తమపై ఉంటాయని మూవీ యూనిట్ భావించి అక్కడ ఈవెంట్ ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్, సినీ అభిమానులు ఎక్కువ మంది ఈవెంట్ కు తరలుతున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఇప్పుడు తిరుపతిలో ‘ఆదిపురుష్’ హంగామా మొదలైంది. తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ తిరుపతికి తరులుతున్నారు. ప్రభాస్ కు ఫాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. వీరంతా ఈవెంట్ కు వెళ్తున్నారు. ప్రభాస్ ను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారట. ఏకంగా రూ. 20వేలు ఖర్చుపెట్టి మరీ ఫ్లైట్ లో వస్తున్నారట. తిరుపతికి వెళ్తున్ వారికి పలకరిస్తే శ్రీవారి దర్శనంతో పాటు హీరోగారిని కూడా చూసి వస్తాం అంటున్నారు.
ఈవెంట్ కు వెళ్లడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. తమ అభిమాన హీరోను చూసేందుకు ఎంతదూరమైనా ఇష్టంగా వెళ్తామని చెప్తున్నారు. చాలా మంది బస్సులు, ట్రయిన్ లలో తిరుపతికి చేరుకోగా.. ఇంకొందరు ఫ్లైట్ లలో వస్తున్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులు ఊహించిన దానికంటే ఎక్కువ మందే వచ్చేలా కనిస్తుంది. దానికి తగ్గ ఏర్పాట్లను మరింత పెంచాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈవెంట్ ను మేకర్స్ అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆదిపురుష్ డిజిటల్ హక్కులు అత్యంత భారీ ధరకు అమ్ముడు పోయాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఎంతంటే ఏకంగా రూ. 400 కోట్లకు అమ్ముడు పోయినట్లు చెప్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి మరి.