Drinking less water : మనిషికి నీరే ప్రాణాధారం. నీరు తాగనిదే ఏ జీవి కూడా ఉండదు. ఏ ప్రాణి అయినా నీళ్లు తాగనిదే బతకలేదు. శరీరంలో నీటి శాతం తగ్గితే చాలా పరిణామాలు మారతాయి. డీహైడ్రేషన్ కు గురయితే వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది. ఎండాకాలంలో మనం తాగే నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. దీని వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.
నీటి శాతం తగ్గితే రక్తంలో ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజర్స్ పెరిగే అవకాశం కలుగుతుంది. దీంతో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రక్తంలోకి కాలేయం మరింత ఎక్కువ కొలెస్ట్రాల్ ను పంపుతుంది. ఫలితంగా మనకు అనారోగ్యం కలిగే ఆస్కారం ఉంటుంది.
నీళ్లు ఎక్కువగా తాగే వారిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో నీళ్లు బాగా తాగితే మనకు అనారోగ్య సమస్యలు ఉండవు. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీళ్లు తాగితే మంచిది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శరీరంలో ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గితేనే ప్రయోజనం కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
మంచినీళ్లతో ఇన్ని రకాల లాభాలున్నాయని తెలిసినా చాలా మంది నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. దీని వల్ల పలు రకాల సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. దీని వల్ల కలిగే కష్టాల గుర్తించి తగినంత నీరు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి గాను అందరు తగిన జాగ్రత్తలు తీసుకుని మంచినీళ్లు బాగా తాగేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది.