Walking After Eating :
ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం దెబ్బతింటోంది. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు లాంటి వ్యాధుల బారిన పడుతున్నాం. మనకు రోగాలు రాకుండా ముందే మేల్కొంటే నష్టం ఉండదు. కానీ మనం ప్రమాదం వస్తే కానీ జాగ్రత్తలు తీసుకోం. ఇలా ముందే మనకు వ్యాధులు వచ్చాయంటే వాటిని నియంత్రణలో ఉంచుకునేందుకు నానా తంటాలు పడాలి. ఈనేపథ్యంలో నడక ఒక్కటే మనకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది.
నడక కొనసాగించేందుకు ఉదయం, సాయంత్రం అనుకూలంగా ఉంటాయి. ప్రతి రోజు ఉదయం కనీసం 45 నిమిషాల నుంచి గంట వరకు నడవొచ్చు. దీని వల్ల ఎన్నో లాభాలుంటాయి. ప్రతి రోజు నడవడం వల్ల 25 రకాల రోగాలు దూరమవుతాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో నడిచేందుకు అందరు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి రోజు నడవడం వల్ల డయాబెటిస్, రక్తపోటు కంట్రోల్ లో ఉంటాయి.
ఉయం నిద్ర లేచిన తరువాత నడవాలి. సాయంత్రం డిన్నర్ చేశాక ఓ అరగంట నడిస్తే ఎంతో మేలు కలుగుతుంది. నడక కొనసాగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బూట్లు లేకుండా నడవడం వల్ల కీళ్లు, తలనొప్పి, తుంటిలో నొప్పి వంటివి రాకుండా ఉంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నడక మంచి లాభాలు తీసుకొస్తుందని వైద్యులు చెబుతున్నారు.
నడక వల్ల చక్కెర నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం సమస్యను దూరం చేస్తుంది. నడక వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా నడక వల్ల మనకు చాలా రకాల మేల కలుగుతుంది. ఈ విషయం తెలుసుకునే చాలా మంది నడిచేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఒత్తిడి కూడా తగ్గిస్తుంది. ఇలా నడక వల్ల మనకు కలిగే లాభాలు తెలిస్తే ఎవరు కూడా నడక వదులుకోరు.
నడక ఎక్కువ సమయం చేస్తే మంచిది కాదు. దానికి నిర్ణీత సమయమే కేటాయించుకోవాలి. రాత్రి తిన్న తరువాత కనీసం ఓ అరగంట నడిస్తే చాలు. కానీ కొందరు ఎక్కువ సమయం నడిస్తే నష్టాలే కలుగుతాయి. అందుకే నడక విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి.