YS Sharmila : ఏపీకి ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారని బిజెపికి ఊడిగం చేస్తూ రాష్ట్ర ప్రయో జనాలను తాకట్టు పెట్టారని ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల ఆరోపించారు. కేంద్రం మెడలు గురించి ప్రత్యేక హోదా తీస్తామన్నవారు ఇప్పుడేమో మోకరి ల్లుతున్నారని ఆమె విమర్శించారు.
విభజన జరిగి పదేళ్లయిన ఏపీకి రాజధాని లేదంటే సిగ్గుచేటు కాదా అని షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. బిజెపి చేసిన మోసాలను ప్రజలు కూడా గమనిస్తున్నారని వాళ్లకు కొమ్ముకాస్తున్న పార్టీలో కూడా బుద్ధి చెప్పాలని షర్మిల పిలుపునిచ్చారు.