Chandrababu Naidu : రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీఏ లో చేరామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకు రాష్ట్ర సమస్యలపై పోరాడే నేతలని అభ్యర్థులుగా నిలబెడు తున్నానని ఆయన తెలిపారు.
నిలబెట్టిన అభ్యర్థులను ఓటర్లు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఇప్పటివరకు 179 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని మిగి లిన 5 ఎమ్మెల్యే ,నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే నిర్ణయిస్తామని తెలి పారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం లో అభివృద్ధి కుంటుపడిందని గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఉంది తప్ప కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చిరకాలన్న రాజధానిగా అమ రావతి కొనసాగాలన్న తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.