Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన కుమా రుడు గిరి తో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు..
ఉభయ గోదావరి జిల్లాల లో కాపు ఓటర్ల ను ఆకట్టుకునేందుకు సీఎం జగన్ ముద్రగడ సేవలను వినియోగించుకోనున్నారు. గతంలో ముద్రగడ, ఎమ్మెల్యే, ఎంపీ మంత్రిగా పనిచేశారు.
ఒకానొక టైంలో ఏపీ రాజకీ యాలు కాపు ఉద్య మ నేత ముద్రగడ చుట్టూ తిరిగిగాయి. మొదట జనసేనలోకి వెళ్లడం ఖాయమని తెలిసింది. కచ్చితం గా జనసేనలో చేరుతున్నట్లు కూడా ముద్రగడ నుంచి సమాధానం వచ్చింది.
ప్రకటన చేసిన కొద్ది రోజులకి ఆయన నిర్ణయం మారింది. తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ తాను వైసిపిలో చేరుతున్నట్లు ముద్రగడ ప్రకటించారు.