CM Revanth : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. ప్రజా సమస్యల పరిష్కారంలో తమదైన శైలిలో దూసుకుపోతోంది. బీఆర్ఎస్ వాళ్లు కేసీఆర్ ను పులితో పోలుస్తూ పులి వస్తే జింకలన్ని పరారవుతాయని చెప్పుకోవడంపై కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ వేస్తున్నారు. పులి వస్తే బోనులో వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా తనను కలవొచ్చని రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా కలిసి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఆరు గ్యారంటీల అమలు కోసం చిత్తశుద్ధితో ఉన్నాం. నీటి పారుదల శాఖలో చోటుచేసుకున్న అవినీతిని బయట పెడతాం. సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ చేసి అవినీతిని నిరూపిస్తామని చెబుతున్నారు.
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలు జరిగినా ఏం జరగనట్లు బుకాయిస్తున్నారు. దేవుడితో రాజకీయాలు వద్దు. దేవుడు ఎక్కడున్నా దేవుడే. దేవుడికి రాజకీయాలకు సంబంధం లేదు. ఎవరికి వీలైనప్పుడు వారు వెళ్లి దర్శనం చేసుకుని రావచ్చు. కానీ దేవుడి పేరుతో రాజకీయాలు చేయొద్దని హితవు పలుకుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అంటున్నారు. ఎవరెన్ని చేసినా కాంగ్రెస్ సత్తా పెరుగుతోంది. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అధికార మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని అవాకులు చెవాకులు పేల్చినా చివరకు విజయం తమదే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.