PM Narendra Modi :
విశ్వగురువుగా గుర్తింపు దక్కించుకున్న భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటీష్ వారి చేతిలో బానిసగా మారింది. మహాత్ముడి శాంతి మంత్రం, సుభాష్ చంద్రబోష్ యుద్ధ చతురతతో పాటు ఎంతో మంది త్యాగదనుల ఫలితంగా భారత్ 1947, ఆగస్ట్ 17న స్వేచ్ఛా గాలులను పీల్చుకుంది. బ్రిటీష్ వారు వెళ్తూ.. వెళ్తూ.. ఇండియా విభజన, సంస్థానాల కలయికపై కొర్రీలు పెట్టి వెళ్లారు. దీంతో ఆ సమస్యలు దాదాపు 77 సంవత్సరాల పాటు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో కొన్ని మెల్లమెల్లగా పరిష్కారానికి నోచుకుంటున్నాయి.
భారత్ నుంచి పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చిన వచ్చిన తర్వాత విడిపోయింది. ఇక జమ్ము-కశ్మీర్ విషయంలో రెండు దేశాలు దాదాపు 76 సంవత్సరాల పాటు కొట్టుకుంటున్నాయి. ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చిన వెంటనే జమ్ము-కశ్మీర్ పూర్తిగా భారత్ లో కలిసిపోయింది. ఇదే కాదు నేడు భారత్ రక్షణా వ్యవస్థతో పాటు ఉత్పత్తి, ఆర్థికం ఇలా చాలా అంశాలలో దూసుకెళ్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి.
భారత్ కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రధాన మంత్రుల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వారు నరేంద్రమోడీ మాత్రమే. ఇప్పటి వరకు భారత్ కు ప్రధానిగా ఉన్న వారిలో ఎవ్వరు కూడా 1947 కంటే ముందు పుట్టిన వారే.. కానీ నరేంద్ర మోడీ మాత్రమే 1950, సెప్టెంబర్ 17వ తేదీన జన్మించాడు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వారిలో మొదటి ప్రధాని నరేంద్ర మోడీ. బీద కుటుంబంలో పుట్టిన మోడీ టీ అమ్ముతూ పెరిగాడు. దేశ భవిష్యత్ మార్చాలని కలలు కన్నాడు. అందుకు తగ్గట్టుగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చాడు. నేడు గ్లోబల్ లీడర్ గా ఎదిగాడు.
ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన పార్టీ లెటర్ హెడ్ పై ప్రధానికి శుభాకాంక్షలు చెప్తూ లేఖ రాశారు. పూర్తి పాఠం లెటర్ మీ కోసం..