- పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్న యువనేత
Nara Lokesh : టీడీపీ+జనసేన కూటమికి ఏపీలో గెలుపు అవకాశాలు ఉంటాయన్న సంకేతాలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గెలుపు అవకాశాలను మరింత పెంచేందుకు యత్నిస్తున్నాడని తెలుస్తోంది. తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు ముందు ‘యువగళం’ పాదయాత్ర చేపట్టిన ఆయన చంద్రబాబు అరెస్ట్ ముందు నిలిపివేశారు. ఆయన అరెస్ట్ తర్వాత ‘యువగళం 2.0’ మొదలు పెట్టారు. ఆ సమయంలో జగన్ ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీన్ని పక్కన ఉంచితే యువగళం 2.0ను కూడా విజయవంగా పూర్తి చేశాడు.
ఆ తర్వాత రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టి క్రీయాశీలంగా వ్యవహరించారు లోకేశ్. ఇప్పటికే యువగళం పాదయాత్రను పూర్తి చేసుకున్న ఆయన ఇప్పుడు జిల్లాల వారీగా సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి నియోజకవర్గాల వారీగా పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే అన్ని అంశాలపై చర్చించాలని లోకేష్ నిర్ణయించారు. ఈ కసరత్తును 40 రోజుల్లో పూర్తి చేయాలని ఆయన టార్గెట్ పెట్టుకున్నారు.
ఏపీలో టీడీపీ పార్టీ మంచి ఊపుతో ముందుకు వెళ్తోంది. ఒక దఫా అధికారం దక్కకపోవడంతో ఈ సారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తోంది. దీనికి చంద్రబాబు అరెస్ట్ అంశం కూడా కలిసి వచ్చింది. బాబు అరెస్ట్ బెయిల్ పై విడుదలతో పార్టీ జనంలోకి మరింత సానుభూతిగా వెళ్లింది. ఏది ఏమైనా ఈ సారి ఏపీలో అధికార బదిలీ తథ్యమన్న సంకేతాలు వస్తున్నారు. ఈ మేరకు ఇంటలీజెన్స్ రిపోర్టులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఇక ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో చూడాలి.