Pawan : ప్రతిపక్ష పార్టీ నాయకుల పర్యటనలను అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తున్నది. ప్రతిపక్ష పార్టీల నేతలు ఎక్కడికి వెళ్లినా అక్కడ వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ప్రస్ర్టేషన్ కనిపిస్తున్నది. ఆ పార్టీ నేతల కంటే ముందే వైసీపీ శ్రేణులు గడబిడ చేస్తున్నాయి. దీనికి పోలీస్ యంత్రంగా కూడా సహకరిస్తున్నదని అపవాదు ఉంది.
అయితే తాజాగా విశాఖలో పవన్ పర్యటన సాఫీగా సాగింది. ఇదే ఇప్పుడు వైసీపీ శ్రేణులకు నిద్రపట్టనీయడం లేదు. పుంగనూరులో పోలీసుల సహకారంతో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు ఇక్కడ తోకముడిచాయి. జనసేనాని వెనుక ఉన్న యువతను చూసి వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం. విశాఖలో పవన్ పర్యటన సాఫీగా జరిగేలా పోలీసులు కూడా సహకరించారు జనసైనికులు భారీగా తరలిరాగా, ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. రుషికొండ పర్యటనకు వెళ్లినా, వైసీపీ శ్రేణుల భూకబ్జాల ప్రాంతాలకు వెళ్లినా పోలీసులు అడ్డు చెప్పలేదు. దీంతో వైసీపీ శ్రేణులు దీనిపై మండిపడుతున్నట్లు సమాచారం. ఒకరిద్దరు అధికారులు మినహా పోలీసులంతా మంచివారేనని కానీ ఆ ఒకరిద్దరి వల్లే చెడ్డపేరు వస్తున్నదని అభిప్రాయం వినిపిస్తున్నది. అయితే ప్రభుత్వానికి భయపడి మరికొందరు తలొగ్గక తప్పడం లేదని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా పవన్ పర్యటన సాఫీగా జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఇది వైసీపీ శ్రేణులకు నిద్ర పట్టనీయడం లేదు. పర్యటనలను అడ్డుకుంటారని అనుకుంటే, పోలీసులే రూట్ క్లియర్ చేయడం స్థానిక శ్రేణులకు మింగుడు పడడంలేదు. ప్రతిపక్ష నాయకులు పర్యటనలంటూ గొడవలకు దిగుతున్నారని బద్నాం చేయాలని చూస్తే, పోలీసులు సాఫీగా పర్యటన కొనసాగేలా ఏర్పాట్లు చేయడం వారికి కష్టంగా ఉందని తెలుస్తున్నది. ఏదేమైనా ఇలాంటి ప్రవర్తన కేవలం వైసీపీ శ్రేణులకే దక్కుతుందనే అభిప్రాయం వినిపిస్తున్నది.