Pawan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్నాడా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.. రాజకీయాల్లో 2024 ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ ఎంత స్టామినా చూపిస్తాడో తెలియదు కానీ సినిమాల్లో ఈయన క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. అట్టర్ ప్లాప్ సినిమాకు కూడా కోట్ల రూపాయలు వసూళ్లు అయ్యేలా చేసే సత్తా ఉంది..
ఒకవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు వరుస లైనప్ ను ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఫిల్ చేసుకుని చేసుకుంటూ పోతున్నాడు.. ఇటీవలే బ్రో సినిమాతో రాగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఈయన ఒకప్పుడు నటించిన సినిమాలు వరుసగా రీరిలీజ్ అవుతుండగా వాటితోనే పండుగ చేసుకుంటున్నారు.
మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2024 ఏడాదిలో రీరిలీజ్ లతో ఫ్యాన్స్ కాలం గడిపే అవసరం ఉండదని అంటున్నారు. ఎందుకంటే ఈయన నటించిన సినిమాలు వరుసగా మూడు ఒకే ఏడాదిలో రిలీజ్ కానున్నాయట.. వచ్చే ఏడాదిలో ట్రిపుల్ ట్రీట్ ఉండబోతుంది అంటున్నారు. ఉస్తాద్ కోసం నెలలో 10 రోజులు అడ్జెస్ట్ చేసి మరీ డేట్స్ ఇవ్వనున్నారట..
మరి ఎన్నికల ముందే ఉస్తాద్ ను బరిలోకి దింపాలని పవన్ అనుకుంటున్నారట.. ఆ తర్వాతనే ఓజి సినిమా రిలీజ్ కానుంది.. ఇప్పటికే సగం పూర్తి కాగా సమ్మర్ బరిలో నిలిపేందుకు ప్లాన్స్ వేస్తున్నారట.. ఆ తర్వాత హరిహర వీరమల్లు కూడా ఎన్నికలు అయిన తర్వాత పూర్తి చేయనున్నారు.. ఇలా మూడు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ చేయనున్నారట.. మొత్తానికి బాక్సాఫీస్ లెక్కలు మార్చేందుకు పవన్ ఈసారి కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్నారు.