2015లో ఇదే భీమవరం లో పవన్ కళ్యాణ్ పోస్టర్ ని చింపిన విషయమై ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. అప్పట్లో ఇరువురి హీరోల మధ్య జరిగిన ఈ గొడవ ని అదుపు చేయడానికి భీమవరం టౌన్ లో 144 సెక్షన్ ని విధించారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కొందరిపై పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు.
ఈ గొడవపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. గతం లో ఇదే భీమవరం లో ప్రభాస్ ఫ్యాన్స్ కి, నా ఫ్యాన్స్ చిన్న పోస్టర్ విషయం లో పెద్ద గొడవ జరిగింది. ఇది నా మనసుని ఎంతో బాధించింది. చిన్న విషయానికి అంత పెద్ద గొడవలు జరగాల్సిన అవసరం లేదు, దయచేసి ఇలాంటి గొడవలకు దిగకండి.. అని మిమల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను” అని తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు. సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
దీని పై ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది. ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఇటీవల పవన్ ప్రసంగాలను ఇష్టపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ సహా అందరినీ తాను ఇష్టపడుతానని ఇటీవల పవన్ వ్యాఖ్యానించారు. మహేశ్ బాబు తనకంటే పెద్ద హీరో అని చెప్పుకొచ్చారు. ఇలా అందరి హీరోల ఫ్యాన్స్ ను పలకరిస్తున్నారు. దీంతో ఆయన పర్యటనకు పాజిటివ్ టాక్ వస్తున్నది. ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా పవన్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కట్టి హడావుడి చేస్తున్నారు. ఎంతైనా పవన్ కి యువతలో ఉన్న క్రేజే వేరు.
ReplyForward
|