ఆర్కే నవల ఆధారంగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ ఒక పీడియాట్రిక్ డ్రామా, యాక్షన్ చిత్రం చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీక్, త్రిషతో పాటు భారీ తారాగణం ఇందులో పాల్గొంది. దర్శకుడు మణిరత్నం దీన్ని తెరకెక్కించగా.. నిర్మాణంలో కూడా అల్లి రాజయ్యతో కలిసి పాలుపంచుకున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహెమాన్ ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.
భారీ తరాగణంతో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా తమిళంలో రూ. 80 కోట్ల వరకూ బిజినెస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ర్టాల్లో సైతం రూ. 10 కోట్ల బిజినెస్ అయ్యింది. దేశ వ్యప్తంగా రూ. 21 కోట్లు.. ఓవర్సీస్ లో రూ. 50 కోట్లు, కేరళలో రూ. 9 కోట్లు బిజినెస్ చేసుకుంది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్లు బిజినెస్ చేసింది.
తెలుగునాట.. పీఎస్-2 ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4వ రోజు వసూళ్లు కొంత మేర తగ్గాయి. నైజాంలో రూ. 55 లక్షలు, సీడెడ్ లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 6 లక్షలు వెస్ట్ గోదారి రూ. 4 లక్షలు, గుంటూర్ రూ. 5 లక్షలు, కృష్ణా రూ. 5 లక్షలు, నెల్లూర్ రూ. 3 లక్షలతో రూ. 92 లక్షల షేర్.. రూ. 2.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.