Rahul Gandhi : పదేళ్లుగా కేంద్రంలో అధికారినికి కాంగ్రెస్ పార్టీ దూరం కావడంతో ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని రాహుల్ గాంధీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. I.N.D.I.Aలో కీలక భూమిక పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వ మార్పును తమ భుజస్కందాలపై వేసుకుంటుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్రలు నిర్వహిస్తున్నాడు.
గతంలో ‘భారత్ జోడో’ యాత్ర నిర్వహించారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర కొనసాగింది. వందలాది కిలో మీటర్లు, పదుల సంఖ్యలో రాష్ట్రాలను కలుపుకుంటూ యాత్ర సాగింది. ఆయా రాష్ట్రంలోకి ప్రవేశించడంతో అక్కడి కాంగ్రెస్ నాయకులు గుంపులు గుంపులుగా కదిలి వచ్చి యాత్రకు ఉత్సాహం నింపారు. కానీ ఇటీవల జరిగిన మినీ జమిలి (ఐదు రాష్ట్రాల ఎన్నికలు)లో కనిపించలేదు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఒక్క (తెలంగాణ) రాష్ట్రంలో తప్ప ఎక్కడా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దరిదాపుల్లోకి కూడా రాలేదు.
ఇదంతా పక్కన ఉంచితే ఇప్పుడు రాహుల్ గాంధీ మరో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ‘భారత్ జోడో’కు కొనసాగింపుగానే ‘భారత్ న్యాయయాత్ర’ చేయాలని నిర్ణయించారు. దాదాపు జనవరి ఫస్ట్ వీక్ లో దీనికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. జనవరి 14వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు యాత్ర సాగుతుంది. నాగాలాండ్, మేఘాలయ, బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ మీదుగా ఈ యాత్ర సాగునుంది. 6200 కి. మీ వరకు ఈ ప్రయాణం సాగుతుంది.