Samantha :
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత గొప్ప మనసున్న నటి అని అందరు చెబుతుంటారు. తన వల్ల సినిమాకు ఏదైనా నష్టం జరిగితే దాన్ని పూడ్చటానికి తనవంతు పాత్ర పోషిస్తుంది. విజయ్ దేవరకొండతో సమంత నటించిన సినిమా ఖుషి ఫెయిల్యూర్ కు తాను కూడా కారణమని భావించి రూ. కోటి తిరిగి నిర్మాతకు ఇచ్చేసిందట. దటీజ్ సమంత అని చెప్పుకుంటున్నారు.
స్టార్ హీరోలందరితోనూ నటించి నాగచైతన్యను పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేసి విడాకులు తీసుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ నటించింది. ప్రస్తుతం సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి అమెరికాలో మయాసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు సినిమా ప్రమోషన్ కు కూడా డబ్బులు తీసుకుంటారు. దీంతో సమంత ఖుషి సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోవడంతో ఆ డబ్బు తిరిగి ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఈ సినిమాకు విజయ్ ఒక్కడే ప్రమోషన్ నిర్వహిస్తున్నాడు. సమంత అందుబాటులో లేకుండా పోయింది. సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కింది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది. సమంత మంచితనాన్ని అందరు ప్రశంసిస్తున్నారు. నిర్మాతకు నష్టం రాకుండా తనవంతు బాధ్యతగా డబ్బు తిరిగి ఇవ్వడంపై అందరు మెచ్చుకుంటున్నారు.
సమంతకు వచ్చిన అనారోగ్యానికి చికిత్స తీసుకునేందుకు అమెరికా వెళ్లింది. అక్కడ ఏడాది పాటు ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సమంత మంచి తనానికి అందరు ఫిదా అవుతున్నారు. సమంత చేసిన పనికి నిర్మాత కూడా సంతోష పడుతున్నాడు. ఇలా సమంత తన గొప్ప మనసు చాటుకుంది. తన పారితోషికంలో రూ. కోటి తిరిగి ఇచ్చి వారి నష్టాల్లో పాలు పంచుకుంది.