AP Cm Jagan ఏపీలో రాబోయే ఎన్నికల దృష్ట్యా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సీట్లను ఖరారు చేసే పనిలో సీఎం జగన్ నిమగ్నమయ్యాడు. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇచ్చే యోచన లో ఉన్నట్లు వైసీపీ కార్యకర్తలు తెలిపారు. ఇప్పుడే కొందరు రాజకీయ నేతలు తమ వారసులను ఎన్నికల బరిలో దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై సీఎం జగన్ తో తాడేపల్లి లో సమావేశం ఏర్పాటు చేశారు.
గతంలోనే కొందరు సీనియర్ నాయకులు తమ వారసులకు సీట్ల కేటాయింపు గురించి జగన్ వద్ద ప్రస్తావించడం జరిగింది. వారసులకు సీట్ల కేటాయింపు ప్రస్ధావన ఉన్నా సీనియర్లకే ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ సీఎం జగన్ ఈ విషయం లో కొందరికి అనుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, పేర్ని నాని కుమారుడు ఉన్నట్లు పార్టీలో గుసగుసలు మొదలైనాయి. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ లీడర్లు తమ వారసులకు టికెట్ల కోసం మరో మారు జగన్ ను సంప్రదించనున్నారు.
టీటీడీ బోర్డు ఏర్పాటు లో భాగంగా సీఎం జగన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన తో కలిసి చర్చించడం జరిగింది. ప్రస్తుతం తిరుపతి మేయర్ గా ఉన్న
తన కుమారుడు అభినయ్ రెడ్డి కి తిరుపతి సీటును కేటాయించమని జగన్ ను ఈ సందర్భంగా కోరినట్లు తెలుస్తుంది. ఎంపీ మోపిదేవి వెంకటరమణ తన తనయుడికి పక్కాగా సీట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. తమ వారసుల సీట్లను ఆశించే నాయకుల వరుసలో చెన్నకేశవ్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి , ధర్మాన, విశ్వరూప్, తిప్పల నాగిరెడ్డి, స్పీకర్ తమ్మినేని, రాజ్యసభ సభ్యుడు బోస్ కూడా ఉన్నారు.
ఇలా వారసులకు సీట్లు ఇప్పించే క్రమంలో పలువురు సీనియర్ నాయకులు సీఎం నిర్ణయం కోసం ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. వైసీసీ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి టికెట్లను ఏ ప్రాతిపదికను కేటాయిస్తాడో అని పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడినట్లు తెలుస్తుంది.