China President : దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరిగింది. దీనికి పలు దేశాధినేతలు హాజరయ్యారు. మన దేశం నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అంతర్జాతీయ వేదికల మీద జరిగే సమావేశాలకు ఓ ప్రొటోకాల్ ఉంటుంది. అక్కడ మన దేశాధినేతలకు అనుచరులను రానివ్వరు. ఒక్కరే వెళ్లాలి. అది అక్కడ రూల్. దీంతో ఏ నేత అయినా సరే ఒక్కరే పాల్గొనడం ఆనవాయితీ.
ఈ సమావేశానికి వెళ్లిన దేశాధినేతల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఉన్నారు. వారు పాల్గొనే సమావేశానికి వెళ్లే సమయంలో కొంత దూరం అనుచరులు వచ్చినా సమావేశ హాల్లోకి మాత్రం ఎవరిని రానివ్వరు. హాల్లోకి అడుగుపెట్టగానే తలుపు వేసేస్తారు. దీంతో అక్కడకు ఇంకెవరిని కూడా అనుమతించరు. ఇది ప్రతి సమావేశంలోనూ జరిగేదే.
అయితే ఇక్కడ చైనా అధ్యక్షుడు వెళ్లే సందర్భంలో హాల్లోకి అడుగు పెట్టగానే ఆయన వెంట ఉన్న అనుచరుడిని ఆపేసి తలుపు వేసేశారు. దీంతో జిన్ పింగ్ వెనకకు తిరిగి చూసుకుని ఉలిక్కిపడ్డారు. ఇది జిన్ పింగ్ కు కలిగిన భయమా? లేక అనుమానమా? అనే కోణంలో అక్కడున్న వారందరు చూశారు. ఒక దేశాధినేతకు ఇంత పిరికితనమా అనే వాదనలు కూడా వస్తున్నాయి.
జిన్ పింగ్ అంతర్జాతీయ సమావేశాలకు ఇదివరకు వెళ్లిన వాడే. నిబంధనలు తెలిసినవాడే. కానీ అతడిలో భయం చూసి అందరు ఆశ్చర్యపోయారు. పెద్ద దేశానికి అధ్యక్షుడైనా కనీస మర్యాదలు పాటించపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ సదస్సుల్లో దేశ అగ్రనేత ఇలా వ్యవహరించడం అనేక సందేహాలకు తావిచ్చింది.