ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఏపీ రాజకీయాల్లో చినికి చినికి గాలి వానలా మారుతున్నాయి… తనను కాదన్న వారిని తారీమేస్తాo అన్న రీతిలో ఉంది ఇప్పుడు ఏపీలో రాజకీయం…ముఖ్యంగా వైసీపీ నాయకులు .. తమ నోటికి పని చెబుతున్నారు. మనుషులు.. స్థాయి … గౌరవం అనేది లేకుండా ఇష్టారాజ్యంగా అందర్నీ తిట్టేస్తున్నారు. తాజాగా రజనీకాంత్ ఉదంతంతో అదే స్పష్టమయింది.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు వచ్చిన రజనీకాంత్ చంద్రబాబు ను పొగిడారు… కానీ ఎవరి గురించి రజనీకాంత్ ఎక్కడా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లలేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల జోలికి అసలు రాలేదు. అధికార పార్టీ విధానాలపై కానీ .. ఏపీలో ఉన్న రాజకీయాలపై కానీ స్పందించారు. తన మిత్రుడ్ని పొగిడారు. దానికే వైఎస్ఆర్సీపీ నేతలు విరుచుకుపడ్డారు.
కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం రజనీకాంత్ను అన్నీ మాటలన్నారు. చివరికి రజనీ ఆరోగ్యపరమైన అంశాలను కూడా ఎగతాళి చేశారు. వ్యక్తిగతంగా తిట్టి పోశారు. రజనీకాంత్ సూపర్ స్టార్. కొన్ని కోట్ల మందికి ఆరాధ్యుడు. ఆయన చంద్రబాబును పొగడటమే తప్పన్నట్లుగా వైఎస్ఆర్సీపీ నేతలు విరుచుకుపడిన వైనం అందర్నీ ఆశ్చర్య పరిచింది. తమిళనాడులోనూ ఈ అంశం వైరల్ అవుతోంది.
చంద్రబాబును పొగిడినా తప్పే అన్న రీతిలో ప్రవర్తిస్తన్నారు వైసీపీ నేతలు… తమపై విమర్శలు చేస్తే ఎదురుదాడి చేయడం సహజం కానీ… ప్రత్యర్థిని పొగిడినా సహించలేని మానసిక స్థితికి వెళ్లిపోయారు వైసీపీ నేతలు. ప్రజాస్వామ్యంలో ఎవరినీ ఎవరైనా పొగడవచ్చు.. విమర్శలు చేయవచ్చు.. ఆలా చేస్తే తప్పు అన్న చందంగా విమర్శలు చేయడం వారి రాజకీయ సంకుచిత మనస్తత్వం తెలియజేస్తుంది.