World Cup 2023 : వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు షాక్ తగిలింది. ఇక తర్వాతి మ్యాచ్ లలో ఆ స్టార్ ఆటగాడు ఆడబోడని జట్టు ఈ రోజు (నవంబర్ 04) ప్రకటించింది. దీంతో నా కౌట్ దశలో కీలకంగా ఉండే బ్యాట్స్ మన్ లేకపోవడంతో జట్టు కొంత ఇబ్బందిగా ఫీలవుతుంది.
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా వరుసగా 7 విజయాలతో అత్యద్భుతంగా రాణిస్తోంది. ప్రస్తుతం ప్రపంచకప్ లో అజేయంగా నిలిచిన ఏకైక జట్టు భారత్. ఇక, అసలు విషయానికి వస్తే టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మిగిలిన మ్యచ్లకు దూరమయ్యాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న హార్థిక్ ప్యాండ్యా శారీరకంగా ఫిట్ గా లేకపోవడంతో మిగిలిన సీజన్ లో జట్టులో ఉండడని కొద్దిసేపటి క్రితం బీసీసీఐ ప్రకటించింది.
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన హార్థిక పాండ్యా కొన్ని మ్యాచ్ లు భారత్ తరఫున ఆడలేదు. టోర్నీ సమయంలో అతను తిరిగి వస్తాడని జట్టుకు, అభిమానులకు ఎక్కడో ఆశ కనిపించింది. కానీ అతను కొనసాగలేడని తాజాగా వైద్యులు చెప్పడంతో ఆశలు అడియాసలయ్యాయి.
హార్థిక్ పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్న భారత్ కొద్దిసేపటి క్రితం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి ప్రత్యర్థులతో భారత్ తలపడినప్పుడు జట్టులో హార్థిక పాండ్యా స్థానం వెలకట్టలేనిది ఆల్ రౌండర్ గా ఆయన ప్రతీ మ్యాచ్ కు కీలకమైన ఆటగాడే. పాండ్యా లేకపోవడం భారత్ కు నాకౌట్ దశలో తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉంది.