మార్గదర్శి కేసులో చట్టానికి లోబడే దర్యాప్తు సాగుతుందని ఏపీ సీఐడీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ స్పష్టం చేశారు. ఎవరిని తాము కావాలని ఇబ్బందులకు గురి చేసేత ఉద్దేశం సీఐడీకి లేదని, విచారణపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈనాడు, ఈటీవీ చేసిన ఆరోపణలను ఖండించారు. విచారణకు మార్గదర్శి యాజమాన్యం స్పందించడం లేదని చెప్పారు.
ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా విచారణ జరుపుతున్నమని తెలిపారు. చట్టాలు ఉల్లంఘించినట్టు ఆధారాలు దొరికాయని తెలిపారు. చట్టం పరిధిలోనే విచారిస్తున్నాం. మేము ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. తాము వారి పట్ల పూర్తి మర్యాదగా పూర్వకంగానే వ్యవహరిస్తూ విచారణ జరుపుతున్నాం.వారికి భోజనం, టీ, మందులకు అవసరమైన స్వేచ్ఛ కూడా ఇస్తున్నామని వెల్లడించారు. నిజాలు రాబట్టేందుకు పారదర్శకంగా విచారణ చేస్తున్నాం. వాళ్ల సమాధానాలు ఇవ్వ లేక చెప్పిందే చెబుతున్నారు’’ అని ఎస్పీ రవికుమార్ వెల్లడించారు.
‘‘నిన్న తమ బృందం విచారణకు వెళ్లినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. టెక్నికల్ ఆఫీసర్స్ను తీసుకెళ్లొద్దని అడ్డుపడ్డారు. ఎండీ శైలజ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఈ సమాచారం పెట్టుకోవాల్సిన అవసరం ఎండీగా తనకు లేదన్నారు. 25 శాతం ప్రశ్నలకు మాత్రమే ఎండీ సమాధానమిచ్చారు. ప్రతీసారి ఏవో సాకులు చెబుతూ విచారణను మరింత ఆలస్యం చేస్తున్నారు. తాము మళ్లీ వెళ్లి శైలజను విచారిస్తాం. అవసరమైతే మరోసారి రామోజీరావుని కూడా విచారిస్తాం’’ అని రవికుమార్ తెలిపారు.
ReplyForward
|