Jagan-Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఒకే రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.
ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా ఇడుపుల పాయకు చేరుకొని తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిం చారు.
మొదటిరోజు కడప జిల్లాలోని పలుకు ప్రాంతాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం నంద్యాల జిల్లాకు చేరుకొని ఎక్కడ ప్రచార సభలను నిర్వహిస్తారు. మేమంతా సిద్ధమనే నినాదంతో సీఎం జగన్ బస్సు యాత్రలో ఈరోజు చేపట్టారు.
ఇక తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా పలమనేరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు పొత్తు తర్వాత తన ప్రచారాన్ని నేటి నుంచి మొదలుపెట్టారు.
నైట్ నుంచి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి వెళ్లి ఎన్నికల సభలను నిర్వహి స్తారు. టిడిపి ఎందుకు అధికారంలోకి రావాలి ప్రజలకు ఆయన వివరించనున్నారు. మొత్తం మీద అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్ర బాబు నాయుడు ఎన్నికల శంఖారావాన్ని పూరించడం విశేషం అని చెప్పవచ్చు.