మనలో చాలా మంది తగినన్ని నీళ్లు తాగరు. దీంతో అనారోగ్యాలను కొనితెచ్చుకుంటారు. ప్రతి వ్యక్తి రోజుకు కనీసం ఐదు లీటర్ల నీళ్లు తాగాలి. మహిళలైతే నాలుగు లీటర్లు తాగాలి. ఇలా నీళ్ల విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. కొందరు మాత్రం దాహం వేసినప్పుడు కూల్ డ్రింక్స్ , ఇతర పానీయాలు తాగడం సహజం. దీంతో దాహం తీర్చుకునేందుకు మంచినీళ్లనే వాడాలి. అంతేకాని ఏదో తాగితే దాహం తీరదు. సమస్య పెరుగుతుంది.
నీళ్లు తక్కువగా తాగితే సమస్యలు వస్తాయి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరం డీ హైడ్రేడ్ కు గురై వడదెబ్బ సోకుతుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే నీళ్లు తగిన విధంగా తాగుతుండాలి. అది కూడా ఒక్కసారి తాగకూడదు. అప్పుడో గ్లాసు చొప్పున తాగాలి. లేకపోతే ఒకేసారి లీటర్ నీళ్లు తాగడం వల్ల ఉపయోగం ఉండదు.
నీరు తాగడం వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుని సరైన మోతాదులో తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే నీళ్లు తాగాల్సిందే. నీటితో మనకు చాలా రకాల మేలు కలుగుతుంది. ప్రతి జీవికి నీరే ప్రధాన ఆహారం. రోజు పొద్దున నిద్ర లేచాక లీటరు పావు నీళ్లు తాగితే మలబద్ధకం సమస్య ఉండదు.
ఇలా నీళ్లను క్రమం తప్పకుండా అప్పుడప్పుడు గ్లాసు చొప్పున తాగాలి. అన్నం తినే సమయంలో నీళ్లు తాగకూడదు. ఒకవేళ తాగితే మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. ఈ నేపథ్యంలో నీళ్లు తాగేందుకు సరైన సమయం చూసుకుని తాగాలి. అప్పుడే మనకు రక్షణ జరుగుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందుకు అందరు శ్రద్ధ తీసుకోవాల్సిందే మరి.