The T20s : త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20లకు నాయకత్వం వహించాలని బీసీసీఐ రోహిత్ శర్మను కోరింది. కానీ అతడు మాత్రం టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ విజ్ణప్తిని రోహిత్ ఓకే చేస్తాడో లేదో తెలియడం లేదు. బోర్డు పెద్దల సూచన మేరకు రిటైర్మెంట్ ను వాయిదా వేసి టీ20లకు పగ్గాలు చేపడతాడో లేదో అనే సంశయం ఏర్పడింది.
వన్డేలు, టెస్టులను పరిగణనలోకి తీసుకుని టీ20లకు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కానీ టీ20లకు కూడా సమర్థుడైన నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే రోహిత్ కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈనేపథ్యంలో రోహిత్ నిర్ణయంపై సందిగ్ధత నెలకొంది. రోహిత్ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు రావడం గమనార్హం.
మరోవైపు ఐపీఎల్ లోనూ ముంబయి ఇండియన్స్ కు టాటా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో రోహిత్ నిర్ణయాలతో అందరు అయోమయంలో పడుతున్నారు. అతడి మీదే ఆశలు పెంచుకున్నందున ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రేక్షకులకు నచ్చడం లేదు. రోహిత్ నాయకత్వంలోనే క్రికెట్ మంచి పసందుగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇప్పుడు టీ20, ఐపీఎల్ ల నాయకత్వం నుంచి తప్పుకునేందుకే నిర్ణయించుకోవడంతో ఇక ఈ జట్లకు లీడర్ ఎవరు? ఎవరు లీడ్ చేస్తారు? జట్లను ఎలా ముందుకు తీసుకెళ్తారనే వాదనలు వస్తున్నాయి. రోహిత్ లో మంచి నాయకుడు ఉన్నాడు. అందుకే అతడు జట్టును సమర్థంగా నడిపించగలడనే ధీమా ఉంది. ఇప్పుడు అతడు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు.