After Lunch Sleep : మనం మధ్యాహ్నం అన్నం తిన్నాక నిద్ర మత్తు ఆవహిస్తుంది. కళ్లు మూసుకుపోతాయి. సమ్మగా ఓ కునుకు తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా ఎదుకు అనిపిస్తుంది. తినగానే మత్తు ఎందుకొస్తుంది. ఇందులో మర్మమేమిటి? అన్నంలో కార్బోహైడ్రేడ్లు ఉండటంతో నిద్ర వస్తుంది. కునుకు తీస్తే కానీ ఇతర పనులకు వెళ్లరు. ఇలా మధ్యాహ్నభోజనం తరువాత కునుకు ఎందుకొస్తుంది?
మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర మత్తురావడం సహజమే. దీంతో రక్తంలో వేగంగా గ్లూకోజ్ పెరుగుతుంది. అన్నంలో ప్రొటీన్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల మధ్యాహ్నం తిన్నాక మంచి నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది. శరీరానికి ఎక్కువ శక్తి లభిస్తుంది. దీని వల్ల మనకు మత్తుగా అనిపించడం సహజం. ఈ నేపథ్యంలో నిద్రకు ఉపక్రమించడం కూడా మామూలే.
అన్నం తినాలంటే బాసుమతి బియ్యం వాడుకోవడం మంచిది. ఇందులో గ్లూకోజ్ త్వరగా రక్తంలో కలవదు. కడుపు నిండా తినకుండా కొంచెం తింటే బాగుంటుంది. కానీ ఎవరు వింటారు. భోజనం ముందు కూర్చున్నామంటే తినాల్సిందే మరి. అన్నానికి బదులు బొన్న, సజ్జ, గోధుమ, బార్లీ వంటి రొట్టెటలతో చేసిన వాటిని తినడం మంచిది.
మాంసాహారులైతే కూరగాయలు, సలాడ్ తో చేసిన చికెన్ తిన్నా కడుపు నిండుతుంది. ఇలా మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే కునుకు రాకుండా ఉంటుంది. అంతేకాని అన్నం కడుపు నిండా తింటే హాయిగా నిద్ర రావడం జరుగుతుంది. మధ్యాహ్నం కునుకు తీస్తే మనసుకు ఎంతో హాయి అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.