అయితే తనపై వచ్చిన ఈప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తనపై బీజేపీ పార్టీ వేటు వేసినప్పటికీ..తాను మాత్రం రానున్న ఎలక్షన్స్లో భాజపా తరపునే ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ నాయకత్వం తనను దగ్గరికి తీస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతానికి తాను బీజేపీ జాతీయ నేతలతో టచ్లోనే ఉన్నట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రులతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్లు తెలిపారు. తనకున్న భావజాలం ప్రకారం వేరే ఏ ఇతర పార్టీ కూడా తనను చేర్చుకునే అవకాశం లేదన్నారు. అంతేకాక తాను ఏపార్టీలో చేరేందుకు ఇష్టపడడం లేదన్నారు. ఎన్నిరోజులైనా తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. టీడీపీలో చేరుతానని వస్తున్న ఆరోపణలు పచ్చి అబద్దమని కొట్టిపారేశారు.