Sidharth Ramkumar : మంగళవారం ప్రకటించిన యుపిఎస్సీ సివిల్స్ ఫలితాల్లో కేరళకు చెందిన సిద్దార్థ రామ్ కుమార్ కు ఆలిండియా 4వ ర్యాంక్ వచ్చింది. తమ కుమారుడు సివిల్స్ లో ర్యాంకు సాధించాడన్న విషయాన్ని టివిలో చూసి తెలుసుకున్న తల్లిదండ్రులు ఆనందంలో తేలిపోయారు.
గత ఏడాది సిద్దార్థ రామ్ కుమార్ సివిల్స్ లో 121వ ర్యాంకు సాధించి ఐపీఎస్ కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్నారు. అయితే ఎలాగైనా ఐఏఎస్ కు ఎంపికవ్వాలన్న పట్టుదలతో ఉన్న సిద్దార్థ మరోసారి సివిల్స్ రాశారు. ఈసారి వెలువడిన ఫలితాల్లో ఏకంగా 4వ ర్యాంకు సాధించి ఆయన కల సాకారం చేసుకున్నారు.
తాను మరోసారి సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో సివిల్స్ ఫలితాలను టీవీలో చూసిన వారు ఆశ్చర్యానికి లోనయ్యారు.