Sharmila Yatra : ప్రత్యర్థుల శిబిరాల్లోకి కార్యకర్తలను పంపి రచ్చ చేయడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నానా యాగీ చేయడం వైసీపీ ప్రచార వ్యూహంలో భాగమని ఎవరిని అడిగినా చెప్తారు. వైసీపీ ప్రచార వ్యూహానికి దెబ్బకొట్టింది షర్మిల. సదరు వైసీపీ నాయకుడు మాత్రం ఖంగు తిన్నాడు. అసలు ఏం జరిగిందంటే.
కాంగ్రెస్ పార్టీ తరుఫున షర్మిల కడపలో ప్రచారం చేసేందుకు వచ్చింది. అక్కడకు వచ్చిన వారిలో ఒక వ్యక్తి తాను షర్మిల ఫ్యాన్ అని కలరింగిచ్చి మైక్ తీసుకున్నాడు. ఇంకే ముంది సాక్షి స్క్రిప్ట్ మొత్తం బట్టీ పట్టి మరీ చదివాడు. ‘2011లో వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మా కోసం పని చేస్తున్నాడని, పాదయాత్ర చేశాడని, పాదయాత్రలో చెప్పిన ప్రతీ హామీ నెరవేర్చాడని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా.. మీ కుటుంబ సమస్యలు ఏవో మీకు ఉన్నాయని.. అందుకే ఇక్కడ రాజకీయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
అతని మాటతీరు చూస్తే స్క్రిప్ట్ బట్టీ పట్టి వచ్చాడని అర్థమైంది. మొత్తం మాట్లాడేవరకు విన్న షర్మిల మాత్రం ఎలాంటి ఆవేశానికి గురి కాలేదు. ఆ తర్వాత తాను ఒక మాట అంది. ‘నువ్వు అభిమానించే వ్యక్తి కోసం నేను 3,200 కి.మీ. నడిచా.. సొంత చెల్లి బతుకే రోడ్డున పడేశాడు.. మీరెంత’ అనడంతో ఆ యువకుడికి నోట మాట రాలేదు. దీని తర్వాత ఎలా మాట్లాడాలో స్క్రిప్ట్ ఆ యువకుడికి ఇవ్వలేదు కాబట్టి.. వెళ్లిపోయాడు.
వైసీపీ సోషల్ మీడియా వింగ్ షర్మిల కౌంటర్ పక్కన పెట్టి ఆ యువకుడి వీడియోను ప్రచారం చేస్తోంది. వీడియోను ఎడిట్ చేసి.. గ్రూపులకు ఫార్వార్డ్ చేసింది. సోదరుడి రాజకీయాన్ని షర్మిల అర్థం చేసుకున్నట్టే కనిపిస్తోందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.