Chandrababu Naidu : రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని ఇంటికి సాగనంపాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దీనికోసం ప్రజలు ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. జనం నమ్మకాన్ని జగన్ కోల్పోయారని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల్లో అక్రమాలను నమ్ముకున్నారని ఆయన విమర్శించారు.
సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైసిపి అక్రమాలకు చెక్ పెట్టాలని ఆయన కోరారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని చంద్రబాబు విమర్శించారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఒక్క పరిశ్రమను కూడా జగన్ తీసుకురాలేకపోయారని ఆయన మండిపడ్డారు. పరిశ్రమలు రావాలన్నా ప్రాజెక్టులు పూర్తి కావాలని టిడిపి, జనసేన, బీజేపి కూటమిని గెలిపించాలని ఆయన కోరారు.