YouTube : ప్రముఖ వీడియో స్ర్ట్టీమింగ్ సంస్థ యూట్యూబ్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట యూట్యూబ్ లో స్టోరీస్ ఫీచర్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో స్టోరీస్ ఫీచర్ ను జూన్ 26 నుంచి రద్దు చేయనుంది. ఈ మేరకు వారం రోజుల ముందే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టింది. ఇక ఇప్పటికే స్టోర్ చేసిన స్టోరీలు కూడా కనిపించకుండా పోతాయి. దీంతో స్టోరీల కథ కంచికి చేరనుంది.
గతంలో కొంతమంది యూజర్ల కోసం స్టోరీ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినా యూట్యూబ్ క్రియేటర్ల కంటెంట్ ను ప్రమోట్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకోవడంతో క్రియేటర్లు స్టోరీలు ఎలా సేవ్ చేసుకునేదని ఆలోచనలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఈ ఫ్యూచర్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
యూట్యూబ్ క్రియేటర్లు తాము అప్ లోడ్ చేస్తున్న కంటెంట్ ను ప్రమోట్ చేుకునేందుకు స్టోరీ లైన్ కు బదులుగా కమ్యూనిటీ పోస్టులు, షార్ట్స్ ను ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు కంటెంట్ తో ఎంగేజ్ చేసేలా రెండు ఫీచర్లతో టెక్ట్స్ తోాటు పోల్స్ క్విజ్, వీడియోలు, ఫొటోలు షేర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
దీంతోనే స్టోరీస్ ఫీచర్ ను నిర్లక్ష్యంగా చూస్తోంది. అందుకే ఈ ఫీచర్ ను ఇక మీదట కొనసాగించొద్దనే నిర్ణయానికి వచ్చింది. దీంతో స్టోరీస్ ఫీచర్ మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ఇది యూజర్లకు ఇబ్బంది కలిగించేదే. కానీ యాజమాన్యం తీసుకునే నిర్ణయం కావడంతో ఏం చేయలేని పరిస్తితి. మునుముందు ఇంకా ఏ నిర్ణయాలు తీసుకుంటుందో తెలియడం లేదు.