YS Jagan : నెగెటివ్ పబ్లిసిటీ కూడా చాలా సార్లు అవతలి వారికి ప్లస్ అవుతుంది. ఈ మధ్య ఏపీ సీఎం జగన్ రెడ్డి చేసిన పనితో ఆయన వ్యతిరేక మీడియాకు కలిసి వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ ఈనాడు పేపర్ ను చూపించి అందులో ఏముందో చదివి వినిపించారు. బహూషా వెటకారం చేద్దాం అనుకున్నారో ఏమో.. లేకుంటే అందులో రాసింది తప్పని చెప్పాలనా.. ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు కానీ జగన్ ఫ్యాన్స్ కు మాత్రం మనం ఈనాడు పేపర్ కూడా చదవాలా? అన్న సందేహం కలిగిందంటా.
మీడియా ఎప్పుడూ ప్రతిపక్షం పాత్ర పోషించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కానీ ప్రజల దౌర్భాగ్యమో ఏమో గానీ పార్టీకో మీడియా వచ్చింది. అంటే వారి ప్రభుత్వంలో జరిగే గొప్పలు వారే పేపరై, మైకై కూయాలి.. వారి తప్పులు కూడా అదే విధంగా ప్రచారం చేయాలి. ఈ లెక్కన జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాక్షి చదవడం ఎక్కువగా అలవాటు చేసుకున్నారు జగనన్న తమ్ముళ్లు. ఇక బహిరంగ సభలో జగనన్న చెప్పిన తర్వాత ఈనాడు చదవకుండా ఉంటారా? ఆయన నెగెటివ్ పబ్లిసిటీ కాస్తా ఎల్లో మీడియాకు ప్లస్ గా మారిందన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.
ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘6’ను అంత సీరియస్ గా తీసుకున్నారేమో జగన్ తన ప్రభుత్వంలో కూడా ఏవైనా సరే ‘6’ గ్యారంటీలు ఇవ్వాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో వింతేంటంటే ఈ 6 గ్యారంటీల గురించి చింతలపల్లి సభలో ప్రచారం చేసే సమయంలో పక్కన ఉన్న వాళ్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఇచ్చే గ్యారంటీలు తనకే తలియదన్నమాట. మొత్తంగా జగన్ రెడ్డి కూడా.. తమకు (ఎల్లో్ మీడియా) ప్రచారం చేశారు. అది నెగెటివ్ వేలో వెళ్లినా పథకాలను వైసీపీ క్యాడర్.. సానుభూతి పరుల్లోకి తీసుకెళ్లడం వారికి హ్యాపీగా అనిపిస్తోంది.