టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో మాజీ మంత్రి , హుజురాబాద్ శాసన సభ్యులు ఈటల రాజేందర్ వరంగల్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. హైదరాబాద్ లోని శామీర్ పేట లోని తన ఇంటి నుండి ఈరోజు ఉదయం వరంగల్ బయలుదేరాడు. ఈటల వెంట భారీ ఎత్తున కార్యకర్తలు , నాయకులు తరలివచ్చారు.
టెన్త్ హిందీ పేపర్ లీక్ అయిన తర్వాత ప్రశాంత్ అనే వ్యక్తి ఈటల రాజేందర్ వాట్సాప్ కు పేపర్ పంపించడంతో వరంగల్ పోలీసులు ఈటల కు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఈటల ఈరోజు వరంగల్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఈటల వెంట పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు , కార్యకర్తలు తరలి రావడంతో వాళ్లందరినీ లోపలకు అనుమతించలేదు. దాంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.