భువనగిరి పార్లమెంట్ సభ్యుడు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసింది మాజీ మంత్రి కొండా సురేఖ. ఈరోజు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. కాగా ఆ సమావేశంలో పాల్గొన్న కొండా సురేఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్రోహం చేశాడని , అందువల్ల ఆయన్ని సస్పెండ్ చేయాల్సిందే అంటూ పట్టుబట్టింది. దాంతో జోక్యం చేసుకున్న రేవంత్ రెడ్డి మీకు ఈ విషయం పై చర్చించాలని ఉంటే ఠాక్రే గారిని కలవండి….. ఫిర్యాదు చేయండి అంతేకాని పాదయాత్ర కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలాంటి చర్చలు వద్దని వారించాడు దాంతో కొండా సురేఖ సైలెంట్ అయ్యింది.
అయితే పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని, పీసీసీ అధ్యక్షుడు, అలాగే కాంగ్రెస్ పార్టీ లేజిస్లేచర్ పార్టీ నాయకుడు ఇద్దరూ కలిసి చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఇక భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య తన భద్రాచలం నియోజకవర్గం నుండే పాదయాత్ర చేయాలని పట్టుబట్టాడు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడానికి అలాగే అధికారంలోకి తీసుకొని రావడానికి పాదయాత్ర ఒక్కటే మార్గమని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమౌతున్నాడు.