అయితే ఎంపీ కేశినేని నాని మాత్రం అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. విజయవాడ టికెట్ ఎవరికైనా ఇచ్చుకోచ్చునని, అందరికీ రెండు వేదికలు ఉంటాయని పేర్కొ్న్నారు. అంటే ఏపీలో వైసీపీ, టీడీపీ రెండు వేదికలు పోటీ చేసేందుకు ఉన్నాయని ఆయన చెప్పకనే చెప్పారు.మరోవైపు పార్టీ అధినేతల మధ్యే విభేదాలు ఉంటాయని, తమకు కావని చెప్పారు. 2019లో అన్ని పార్టీల్లో ఉన్న తన సానుభూతి పరుల వల్లే గెలిచానని, ఒక్క టీడీపీ వల్లే కాదని అన్నారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒకరినొకరు పొగుడుకున్నారు. అయితే ఇటీవల నందిగామలోనూ అక్కడి వైసీపీ ఎమ్మెల్యేను కూడా మెచ్చుకోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గాన్ని నాలుగేళ్లలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గణనీయంగా అభివృద్ధి చేశాడని పేర్కొన్నారు. అయితే టీడీపీకి చెందిన ఎంపీని వైసీపీ ఎమ్మెల్యేలు కొనియాడడం, వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ ఎంపీ మెచ్చుకోవడం పార్టీలకతీతంగా మంచి సంప్రదాయమే అయినా ఇక్కడ మాత్రం కొంత చర్చనీయాంశమవుతున్నది. ఎంపీ కేశినేని నాని కొంత కాలంగా టీడీపీ అధినేత మీద కోపంగా ఉన్నట్లు సమాచారం.
తన కుటుంబంలో విభేదాలను టీడీపీ అధినేత చంద్రబాబు వాడుకుంటున్నట్లు ఆయన భావిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. అయితే ఎన్నికలకు మరో ఏడాదే మిగిలి ఉండడం, మరో వైపు జగన్ ముందస్తు ఆలోచనల నేపథ్యంలో విజయవాడ ఎంపీ తీరు టీడీపీ అధినేతకు తలనొప్పిగా మారింది. ఆయన ఏకంగా తనకు మరో వేదిక కూడా ఉందని అధినేతకు హింట్ ఇస్తున్నట్లు అంతా భావిస్తున్నారు. అయితే టీడీపీ ఎంపీ కేశినేని నానికి సౌమ్యుడిగా పేరుంది. మరి ఆయన చంద్రబాబుపై ఆగ్రహించడానికి గల కారణాలపై చర్చ సాగుతున్నది.
ReplyForward
|